Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : అనేకక ఊహాగానాల మధ్య ఐడిఎఫ్సీ బ్యాంక్, క్యాపిటల్ ఫస్ట్ ఎట్టకేలకు ఒక్కటయ్యాయి. బ్యాంకింగేతర విత్త సంస్థ క్యాపిటల్ ఫస్ట్, ఐడిఎఫ్సీ సంస్థలు విలీనం అయినట్లు శనివారం ప్రకటించాయి. వీటి ఆమోదానికి సంబంధించిన అన్ని అనుమతులు రావాల్సి ఉంది. ఆ తర్వాత సంయుక్త భాగస్వామ్యంలో ఈ సంస్థలు కొనసాగనున్నాయి.
దీంతో సుమారు 64లక్షల మంది వినియోగదారులు రూ. 1.4కోట్ల ఆస్తులతో ఈ జాయింట్ వెంచర్ అమల్లోకి రానుంది. మరోవైపు ఈ కంపెనీకి బీపీిల్ జెమానీ మధ్యంతర సీఈవొగా వ్యవహరించనున్నారు. ఈ క్రమలోనే ఆయన ఐడీిఎఫ్సీి సీిఎఫ్ఓ పదవీకి రాజీనామా చేశారు. అదే విధంగా క్యాపిటల్ ఫస్ట్ వ్యవస్థాపకులు వైద్య నాథన్ నూతన సంస్థలకు సీఈవొ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. కాగా ఐడీిఎఫ్సీికి చెందిన రాజీవ్ లాల్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉంటారు. ఈ ఒప్పందం ప్రకారం 10 క్యాపిటల్ ఫస్ట్ షేర్లకు గాను, ఐడీిఎఫ్సీి 139 షేర్లు దక్కనున్నాయి. ఐడీిఎఫ్సీి ఇంతక్రితం శ్రీరామ్ సిటీ యూనియన్తో విలీనాన్ని రద్దు చేసుకుంది. ఆ తర్వాత కాపిటల్ ఫస్ట్తోనూ ఇదే జరుగనుందన్న ఊహాగానాలకు తాజాగా రెండు సంస్థల తమ ఏకీకరణతో సమాధానం చెప్పినట్లయ్యింది. విలీనం తర్వాత వీటి ఆస్తులు రూ.88,000 కోట్లకు చేరొచ్చని అంచనా. డీిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ 194 శాఖలకు, 353 చానల్స్కు, 9,100 మైక్రో ఎటీిఏంలకు చేరనున్నాయి. శుక్రవారం బీఎస్ఈలో ఐడీిఎఫ్సీి షేర్ విలువ 1.31 శాతం తగ్గి రూ.67.65 వద్ద ముగిసింది. కాపిటల్ ఫస్ట్ సూచీ 0.05 శాతం పెరిగి రూ.835.90 వద్ద ముగిసింది.