Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వొడాఫోన్ -ఐడియా మెగా విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీిఎల్టీి)నుంచి అమోదం లభించిందని ఐడియా సెల్యూలర్ ప్రకటించింది. ఇక ఫైనల్గా రెండు కంపెనీలకు టెలికామ్ విభాగం నుంచి తుది ఆమోదం రావాల్సి ఉంది. గత ఏడాది మార్చిలో బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ గ్రూపునకు చెందిన వొడాఫోన్ ఇండియా.ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఐడియా సెల్యులార్తో విలీనం కాబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం విలువ 23 బిలియన్ డాలర్లుగా ఉంది. విలీనం పూర్తి అయితే భారత టెలికం సెల్యూలర్ రంగంలో 35 శాతం మార్కెట్ వాటా ఈ సంస్థలదే కానుంది.