Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా : నాణేల తయారీని నిలిపివేయాల్సిందిగా ఈ మధ్యకా లంలోనే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. తిరిగి నాణేల తయారీని పునరుద్ధరిం చాల్సిందిగా సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్పీఎంసీిఐఎల్)కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కోల్కతా, ముంబయి, నోయిడా, హైదరబాద్లో ఈ తయారీ కేంద్రాలు(మింట్) ఉన్నాయి. కాగా శుక్రవారం నుంచే తిరిగి నాణేల తయారీని తిరిగి ప్రారంభించామని కోల్కతా మింట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బిజన్ దేవ్ తెలిపారు. కాగా రెండు షిఫ్టుల్లో కాకుండా ఒకే షిఫ్ట్లో పనియాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. బ్యాంకుల్లో నాణేలను భద్రపరిచేందుకు స్థలం లేదని నాణేల తయారీని నిలిపివేయాల్సిందిగా ఈనెల 9న ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేసింది. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.