Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎయిర్ ఇండియాలో 49 శాతం ఎఫ్డీఐలకు ఆమోదం ప్రత్యామ్నాయమార్గం చూపుతుందా.. లేదా. ఉద్యోగుల్లో అనుమానాలుమొండిగా మోడీ సర్కారు ముందుకే..
మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రభుత్వరంగసంస్థలను నిర్వీర్యం చేయటమే పనిగా పెట్టుకున్నది. ఎయిరిండియాకు వచ్చిన కష్టాలు, నష్టాల బూచి చూపించి వదిలించుకునే మార్గాలను కేంద్రం ఆలోచిస్తున్నదన్న వాదనలు బలంచేకూరేలా..49 శాతం ఎఫ్డీఐలకు మోడీ క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఇప్పుడు అందులో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒకటే ఆందోళన.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టే సంస్థలు మళ్లీ ఉద్యోగం ఇస్తాయా.. ప్రత్యామ్నాయమార్గం చూపుతానంటున్న కేంద్రం అదే మాట మీద నిలబడుతుందా..అనే అనుమానాలు ఉద్యోగ వర్గాలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.అయితే ఎయిరిండియాలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు.?బీజేపీ సర్కారు ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్లాలనుకుంటున్నది.?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం దూకుడు పెంచింది. దీనిలో భాగంగానే ఎయిరిండియాలో విదేశీ కంపెనీలు 49శాతం పెట్టుబడులు పెట్టేందుకు ఇటీవలే కేంద్రం ఆమోదం తెలిపిన విషయం విదితమే. క్యాబినెట్ ఎఫ్డీఐలను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి.. ఎయిరిండియాలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒకటే టెన్షన్..టెన్షన్. ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిపి సుమారు 29వేల మందికి పైగా పనిచేస్తున్నారు.ఎఫ్డీఐలు గుమ్మరిస్తామంటూ..బీజేపీ సర్కారు ప్రకటన కారణంగా.. ఎయిరిండియాను ప్రయివేటీకరిస్తే అందులో పనిచేసే ఉద్యోగుల్లో ఎంతమంది ఉద్యోగాలు ఉంటాయి..ఎంతమంది ఉద్యోగాలను కోల్పోతారోనన్న భయాందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా ఎవరికైనా ఉపాధి కోల్పోతే కోలుకోవటానికి చాలా సమయం పడుతోంది. ఇన్నాళ్లు తమ సంస్థగా భావించే ఎయిరిండియాలో పనిచేసే ఉద్యోగులను తొలగిస్తే..ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
కేంద్రం అంటున్నదేంటీ..?
ఎయిరిండియాలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యామ్నాయ మార్గం చూపుతామని మోడీ సర్కారు అంటోంది. ముందుగా ఇక్కడ పనిచేసే ఉద్యోగులను వేరే ప్రభుత్వ రంగ సంస్థల్లోకి తీసుకోవడం, లేదా వాలంటరీ రిటైర్మెంట్ ప్యాకేజ్ ఇచ్చే ఆలోచనను కేంద్రం చేస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా వాలంటరీ రిటైర్మెంట్ ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకోవాలని యోచిస్తున్నట్టు ఎయిర్ఇండియా కార్మికసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.మరోవైపు ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణను కార్మికసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫారసులు ఏమంటున్నాయి..?
ప్రభుత్వరంగసంస్థ అయిన ఎయిరిండియాను కొనటానికి సింగపూర్ ఎయిర్లైన్స్ రెడీ అయ్యింది.2018 ఆఖరుకన్నా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను పూర్తిచేస్తామని కేంద్రమంత్రి జయంత్ సిన్హా ప్రకటించారు.మరోవైపు పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా మోడీ సర్కారు ఎఫ్డీఐల నిర్ణయాన్ని ఐదేండ్ల పాటు వాయిదా వేయాలని కోరింది.నెమ్మదిగా కోలుకుంటున్న ఎయిరి ండియాను..మరికొంతకాలంపాటు సమయమివ్వాలని ప్రతిపాదించింది. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం ఇవేమి పట్టించుకోవటానికి సిద్ధంగాలేదన్నట్టుగా వ్యవహారిస్తోంది. ఎంత తొందరగైతే అంత వేగంగా ప్రభుత్వరంగసంస్థలను అమ్మేయటానికి సన్నద్ధమవుతోంది.ఈ చర్యను ప్రతిపక్షాలు, కార్మికసంఘాలు ఆక్షేపిస్తున్నాయి.