Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జపాన్కు చెందిన ఇసుజు మోటార్స్ లిమిటెడ్ అడ్వెంచర్ యుటిలిటీ వాహనం ఇసుజు వీ-క్రాస్లో అప్గ్రేడెడ్ వెర్షన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని హై, స్టాండర్ట్ రెండు వేరియంట్స్లో అందుబాటులోకి తెచ్చింది. చెన్నై కేంద్రగా వీటి ధరలు రూ.14,26లక్షల-15,76లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. 2.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ వాహనం 132 బీహెచ్పీని ఉత్పత్తి చేస్తుంది. 320 ఎన్ఎం టార్క్, 5-స్పీడ్ మ్యానువల్, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ) ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టీసీఎస్), డే టైమ్ రన్నింగ్ లైట్స్ (డీఆర్ఎల్), ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్, ఆలో క్రూయిజ్ కంట్రోల్, 6-వే పవర్ ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రియర్ వ్యూ కెమేరా, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, స్పోర్టీ బ్లాక్ లెదర్ సీట్స్ వంటి ఫీచర్లతో ఈ కొత్త ఎడిషన్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది.