Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్యుల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో 28 శాతం వృద్ధితో రూ.1,326 కోట్ల నికర లాభాలు సాధించాయి. గతేడాది ఇదే సమయంలో రూ.1,038 కోట్ల లాభాలు నమోదు చేసింది. క్రితం క్యూ3లో మొత్తం ఆదాయం 4శాతం వృద్ధి చెంది రూ. 8,400 కోట్ల నుంచి రూ.8,742 కోట్లకు ఎగిసింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో తాము మరో మంచి పదర్శనను కనబర్చటంతో పాటు అన్ని విభాగాల్లో విస్తృత ఆధారిత వృద్ధితో మెరుగైన మార్జిన్లను సాధించామని హెచ్యుఎల్ చైర్మెన్ హరీష్ మాన్వానీ పేర్కొన్నారు. గత క్యూ3లో కంపెనీ వ్యయాలు రూ.7,036 కోట్లుగా చోటు చేసుకున్నాయి.