Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి 15 నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 18.7 శాతం పెరిగి రూ.6.89 లక్షల కోట్లకు చేరాయి. 2017-18లో రూ.9.8 లక్షల కోట్లు వసూలు చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) లక్ష్యంగా పెట్టుకుంది. కాగా తొలి తొమ్మిదిన్నర మాసాల్లో 70 శాతం వసూళ్లు చేసినట్టు బుధవారం వెల్లడించింది. 2016-17 ఇదే కాలం వసూళ్లతో పోల్చితే 18.7 శాతం పెరుగుదల ఉంది. గత తొమ్మిదిన్నర మాసాల కాలంలో రూ.8.11 లక్షల కోట్ల స్థూల వసూళ్లు నమోదయ్యాయి.