Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ సర్కారు మరో సంచలన నిర్ణయానికి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అనేక రంగాల్లోకి 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐల)కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బ్యాంకింగ్ రంగంలోనూ 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని కార్యాలయం ఆమోదం పొందవచ్చునని ప్రముఖ ఆంగ్ల ఛానెల్ ఓ కథనంలో పేర్కొంది. బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం ఉన్న 74శాతం ఎఫ్డీఐ పరిమితిని 100శాతానికి పెంచేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ, డీఐపీపీ, ఐబీఏ చర్చలు జరుపుతున్నాయని తెలిపింది. దీనికితోడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీలు) కూడా ఎఫ్డీఐల పరిమితిని 49శాతానికి పెంచవచ్చునని వివరించింది. పౌర విమానయాన రంగంలో మరిన్ని ఎఫ్డీఐలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం విదితమే.