Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఎయిర్ కండీషనర్ల తయారీ సంస్థ అంబర్ ఎంటర్ప్రైజెస్ పబ్లిక్ ఇష్యూకు మార్కెట్ వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించింది. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఐపీవో శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు గడువు ముగిసే సమయానికి ఈ సంస్థ ఇష్యూకు దాదాపు 165.31 రెట్ల స్పందన వచ్చింది. సంస్థ 49.27 లక్షల షేర్లను ఐపీవోకు ఉంచగా దాదాపు 81.45 కోట్ల మేర బిడ్లు లభించాయి. ఎన్ఎస్ఈలో చిట్టచివరిగా అందుబాటులో ఉన్న సమాచారం మరకు ఈ ఇష్యూ ద్వారా సంస్థకు రూ.600 కోట్ల వరకు నిధులు సమకూరనున్నాయి. యాంకర్ ఇన్వెష్టర్లకు వాటాల విక్రయం ద్వారా సంస్థ ఇప్పటికే దాదాపు రూ.179 కోట్ల మేర నిధులను సమీకరించింది. ఈ పబ్లిక్ ఇష్యూకు సంస్థ రూ.855-859 ధరల శ్రేణిని నిర్ణయించినప్పటికీ రిటైల్ ఇన్వెష్టర్ల నుంచి మెరుగైన స్పందన లభించిడం విశేషం.