Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా: ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజ సంస్థ ఐటీసీ మేటి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 16.74శాతం వృద్ధి చెంది రూ.3,090 కోట్లకు పెరిగింది. 2016-17 ఇదే త్రైమాసికంలో రూ.2,647 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో ఆదాయం 5.7శాతం పెరిగి రూ.9,772 కోట్లకు ఎగిసింది. గతేడాది ఇదే కాలంలో రూ.9,248 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇక నిర్వహణ లాభం (ఈబిటా) 10శాతం పుంజుకుని రూ.3,904 కోట్లకు చేరాయి..అలాగే మార్జిన్లు 38శాతం నుంచి 40శాతానికి ఎగిశాయి. వీటిలో సిగరెట్ల అమ్మకాలు ద్వారా రూ.4629 కోట్లు సాధించినట్టు కంపెనీ పేర్కొంది. అగ్రి బిజినెస్ 8.44 శాతం తగ్గి రూ. 1,530.86 కోట్లకు పడిపోయింది. మరోవైపు పేపర్, ప్యాకేజింగ్ వ్యాపారాలు 4.20 శాతం పెరిగి 1,279.6 కోట్లుగా నమోదైంది. మరోవైపు హోటల్ వ్యాపారాలతో పాటు ఇతర విభాగాల్లో వరుసగా 9.16శాతం, 11.77శాతం వృద్ధితో రూ.404 కోట్లు, రూ.2,871కోట్లను నమోదు చేసింది.
ఈ ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐటీసీ పేరు ఒక్క శాతం పెరిగి రూ.273.85 వద్ద ముగిసింది.