Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టెలికాం నియంత్రణ సంస్థ ట్రారు రిలయన్స్ కమ్యూనికేషన్స్కు (ఆర్కామ్) మరో షాక్ను ఇచ్చింది. వినియోగదారుల నుంచి వివిధ రూపాల్లో వసూలు చేసి ఖర్చు చేయకుండా తమ వద్ద ఉంచుకున్న నగదును తిరిగి వారికే ఇచ్చేయాలంటూ ఆర్కామ్కు ఆదేశాలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఆర్కామ్ వినియోగదారుల నుంచి అందుతున్న ఫిర్యాదులకు స్పందించిన ట్రారు ఈ ఆదేశాలను జారీ చేయడం విశేషం. ఆర్కామ్ సంస్థ గత డిసెంబరు నుంచి దశల వారీగా తన నెట్వర్క్లో వాయిస్ సేవలను నిలిపివేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థ పోస్ట్పెయిడ్, ప్రీ పెయిడ్ వినియోగదారులు తాము కంపెనీ చర్యలతో నష్టపోయామంటూ ట్రారుని ఆశ్రయించారు. దీంతో ప్రీపెయిడ్ వినియోగదారులు చెల్లించిన ముందస్తు సొమ్మును, పోస్ట్పెయిడ్ వినియోగదారులు చెల్లించిన డిపాజిట్ సొమ్మును వారికి తిరిగి ఇచ్చేయాలని ట్రారు ఆర్కామ్కు ఆదేశాలిచ్చింది.