Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8.4 శాతం పడిపోయిన లాభాలు
- రూ.1 మధ్యంతర డివిడెండ్కు సై!
బెంగళూరు: దేశీయ ఐటీ రంగంలో మూడో అతిపెద్ద సేవల సంస్థ విప్రో డిసెంబరు త్రైమాసికానికి నిరాశజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలానికి సంస్థ ఏకీకృత నికర లాభం దాదాపు 8.4 శాతం మేర పడిపోయి రూ.1,931 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ.2189.60 కోట్లుగా నమోదు అయింది. అయితే ఇదే కాలంలో సంస్థ ఆదాయం మాత్రం 1.83 శాతం మేర పెరిగి రూ. 13,423 కోట్ల నుంచి రూ.13,669 కోట్లకు చేరింది. ప్రస్తుతం కొంత నిరాజనక లాభాలు నమోదైనప్పటికీ రానున్న నాలుగో త్రైమాసికంలో మాత్రం సంస్థ మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా సంస్థ తెలిపింది. ఐటీ సేవల ద్వారా సంస్థ దాదాపు 2.014-2.054 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసే అవకాశం ఉందని సంస్థ సీఈవో, బోర్డు సభ్యులు అబీదలి నిముచివాలా తెలిపారు. జులై బోర్డు సమ్మతించిన మేరకు 343.75 మిలియన్ల ఈక్విటీ వాటాల బైబ్యాక్ ఆఫర్ను సంస్థ డిసెంబరు నాటికి పూర్తి చేసింది. ఫలితంగా సంస్థ ్థనుంచి దాదాపు రూ.11,000 నగదు బయటకు వెళ్లిపోయింది. ఇది ఫలితాలపై కొంత ప్రభావాన్ని చూపింది. ఫలితాలు నిరాశజనకంగా ఉన్నప్పటికీ సంస్థ మదుపరులను మెప్పించేలా షేరు ఒక్కింటికి రూ.1 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. డిజిటల్ లావాదేవీల నుంచి సంస్థ సంస్థ 25 శాతం ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్టుగా విప్రో తెలిపింది. డిసెంబరు నాటికి సంస్థలోని ఉద్యోగుల సంస్థ 1,62,553కి చేరినట్టుగా సంస్థ వెల్లడించింది. ఫలితాల నేపథ్యం విప్రో స్టాక్ శుక్రవారం దాదాపు 0.74 శాతం మేర పెరిగి రూ.328.45కు చేరింది.