Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన హల్వా వేడుక
- ముద్రణ ప్రారంభం
- మరో 10 రోజుల్లో పార్లమెంట్లో
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. బడ్జెట్ తయారు, వివరాలు ఆర్థిక శాఖ చాలా గోప్యంగా ఉంచుతుంది. బడ్జెట్ రూపకల్పనలో పాల్గొనే ఆర్థిక శాఖకు చెందిన 100 మందికి పైగా సిబ్బంది కనీసం 10 రోజులు పూర్తిగా అజ్ఞాతంలో, నేల మాళిగలో ఉండి పని చేస్తారు. బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు హల్వా వేడుక జరుగుతుంది. శనివారం సాయంత్రం ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. ఓ పెద్ద పాత్రలో హల్వాను తయారు చేసి చేసి ఉద్యోగులందరికీ పంచి పెట్టారు. ఈ కార్యక్రమం తరువాతే బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభమవుతుంది. నార్త్ బ్లాక్లో ముద్రణ జరుగుతుంది. అధికారులంతా అక్కడే ఉంటారు. ముద్రణ పూర్తయి బడ్జెట్ సమర్పించే వరకూ ఎవ్వరూ ఇంటికి కూడా వెళ్లరు. భవనం మొత్తం పూర్తి భద్రతలో ఉంటుంది. నీల రంగు కాగితాలపై సుమారు 100 పేజీలు ఉండే బడ్జెట్ డాక్యుమెంట్ను చూడ్డానికి కనీసం ఆర్థిక మంత్రిని కూడా అనుమతించరు. ముద్రణ ప్రక్రియ మొత్తం సంయుక్త కార్యదర్శి (బడ్టెట్) నియంత్రణలో వుంటుంది. 1950 వరకూ బడ్జెట్ డాక్యుమెంట్లను రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. ఈ తరువాత మింటో రోడ్లోని ప్రభుత్వ ప్రెస్లో ముద్రించేవారు. 1980 నుంచి నార్త్ బ్లాక్లోని బేస్మెంట్లో ముద్రిస్తున్నారు. హల్వా వేడుక ముగిసిన దగ్గర నుంచి ఈ ప్రాంతం భద్రత పరిధిలోకి వస్తుంది. ఆర్థిక మంత్రిని కూడా మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లడానికి అనుమతించరు. పార్లమెంట్లో బడ్జెట్ను ప్రకటించే వరకూ అధికారులకు ఇక్కడే భోజనం, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఫోన్ కాల్స్పై ఎప్పుడూ నిఘా వుంటుంది. ఆర్థిక శాఖకు చెందిన కంప్యూటర్లలో ఈమెయిల్ సౌకర్యాన్ని తొలగిస్తారు. ఢిల్లీ పోలీసులు, ఇంటిల్జెన్స్ బ్యూరో (ఐబీ) సిబ్బంది సంయుక్తంగా భద్రతను పర్యవేక్షిస్తారు.
నార్త్ బ్లాక్లో గోప్యంగా వుండే అధికారుల్లో ఆర్థిక శాఖకు చెందినవారితో పాటు న్యాయ శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు (సీబీఈసీ)కు చెందిన నిపుణులు కూడా వుంటారు.
హల్వా సంప్రదాయం వెనుక..
భారతీయ సంస్కృతిలో శుభకార్యం మొదలుపెట్టినపుడు తియ్యటి పదార్థంతో నోటిని తీపిచేస్తారు.కేంద్రంలో ఉండే ఆర్థికమంత్రి ఈ హల్వాను బడ్జెట్ తయారీలో నిమగమైన ఉద్యోగులకు ఇలా తినిపించటం ఆనవాయితీగా మారింది.