Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేరళా కేంద్రంగా పని చేస్తున్న క్యాథలిక్ సిరియన్ బ్యాంక్లో(సీఎస్బీ) కీలక వాటాను ఫెయిర్ఫాక్స్ ఇండియా హోల్డింగ్స్ సంస్థ చేజిక్కించుకోనుంది. ప్రవాస భారతీయుడు, కెనడాలో నివసిస్తున్న ప్రేమ్వత్సాకు చెందిన ఫెయిర్ఫాక్స్ సంస్థ మొత్తం రూ.1200 కోట్లు చెల్లించి సీఎస్బీలో కీలక వాటాను సొంతం చేసుకోనుంది. శనివారం సమావేశమైన సీఎస్బీ బోర్డు ఫెయిర్ఫాక్స్ ప్రతిపాదనకు సమ్మతి తెలిపింది. వాటా కొనుగోలుకు సంబంధించి ఇరు పార్టీల వారు వచ్చే వారం ఒక అవగహ పత్రంపై సతకం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకులోని దాదాపు 51 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు గాను ఫెయిర్ఫాక్స్్ సంస్థ నిరంతరాయంగా ఆసక్తి కనబరుస్తూ వచ్చిందని.. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వారికి సమ్మతమైన ధర వద్ద 51 శాతం వాటా విక్రయానికి తాము అంగీ కరించినట్టుగా బ్యాంక్ చైర్మెన్ టి.ఎస్. అనంతరామన్ తెలిపారు. షేరు ఒక్కింటికి రూ.140 చొప్పున వాటాను కొనుగోలు చేసేందుకు గాను ఫెయిర్ ఫాక్స్ అంగీకారం తెలిపింది. అయితే ఈ విలీనానికి సంబంధంచి పలు అనుమతలు ఇంకా లభించాల్సి ఉందని ఆయన తెలిపారు.