Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీలక పాత్రదారులు అరెస్ట్
- సీబీఐ కోర్టు ముందు హాజరుొ 14 రోజుల రిమాండ్కు ఆదేశం
- కొనసా..గిన ఏజెన్సీల సోదాలుొ ఆర్బీఐ స్టాఫ్ పాత్రపై నజర్
- పలు కీలకాంశాలు వెలుగులోకి
- ఎన్డీఏపై ప్రతిపక్షాలు గుర్రు- ఆ పాపం యూపీఏదే: ఎన్డీఏ
- జాయింట్ పార్లమెంటరీ విచారణకు పోదాం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: దేశంలోని రెండో అతిపెద్ద విత్త సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో (పీఎన్బీ) జరిగిన ఘరానా మోసానికి సంబంధించి శనివారం పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ఈ భారీ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన బ్యాంకు అధికారులను సీబీఐ శనివారం అదుపులోకి తీసుకుంది. ప్రధాన సూత్రదారుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్మోదీకి సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పీఎన్బీ డిప్యూటీ మేనేజర్ గోకుల్ నాథ్ శెట్టిని, పీఎన్బీ ఎస్డబ్ల్యూవో మనోజ్ ఖారత్ను, నీరవ్ మోదీ గ్రూప్ సంస్థలకు అధికారిక సంతకందారు హేమంత్ భట్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఎటువంటి రుణ పరిమితి గానీ లేదా నగదు మార్జిన్ గానీ లేకుండానే 'లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్' (ఎల్ఒయు) పొందేందుకు గోకుల్ నాథ్ శెట్టి, మనోజ్ ఖారత్, హేమంత్ భట్లతో కలిసి నీరవ్ మోదీ భారీ కుట్రకు పాల్పడ్డారని పీఎన్బీ తన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. వీరిని ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు తదుపరి విచారణ నిమిత్తం వీరిని 14 రోజల (మార్చి 3వ తేదీ వరకు) రిమాండ్కు ఆదేశించింది. ఇందులో మనోజ్ ఖారత్ బ్యాంకు మోసాన్ని ప్రాథమిక విచారణలోనే ఒప్పుకున్నట్టు సమాచారం కాగా.. వీరి నుంచి తదుపరి వివ రాలతో పాటు కనిపించకుండా పోయిన దస్త్రాలు.. కుం భకోణం వాస్తవ విలువలను అంచనా వేసేందుకు గాను నిం దితులను తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరింది.
మూడో రోజు కొనసాగిన సోదాలు..
స్కామ్ సూత్రధారి నీరవ్ మోదీకి గోకుల్ నాథ్ శెట్టి అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ముంబైలోని ఆయన నివాసంలో కూడా సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ స్కామ్లో గోకుల్ శెట్టిని సహ నిందితుడిగా బ్యాంకు పేర్కొంది. ఇది ఇలా ఉంటే నీరవ్ మోదీ, గీతాంజలి గ్రూపుల సంస్థలపై ఈడీ దాడులు మూడవరోజు కూడా కొనసాగాయి. శనివారం మరో రూ.25కోట్ల విలువైన డైమండ్, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని, దీంతో మొత్తం విలువ రూ.5,674 కోట్లకు చేరిందని ఒక ప్రకటనలో వెల్లడించింది.
పెద్ద తలలపై ప్రత్యేక నజర్..
కఠినమైన నిఘా బ్యాంకింగ్ నిబంధనలను పక్కన బెట్టి, ఆడిటింగ్ అధికారుల కండ్లుగప్పి పీఎన్బీలో రూ.11,400 కోట్ల మోసం జరగడం కేవలం ఒక్కరిద్దరు ఉద్యోగుల హస్తంతో జరిగే పని కాదని విచారణ సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీల విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. పీఎన్బీ కుంభకోణంలో పీఎన్బీ టాప్ అధికారి, ఆర్బీఐ ముఖ్య అధికారుల పాత్ర ఉందన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా పీఎన్బీ ఛైర్మన్ సహా, ఆర్బీఐ ఉన్నతాధికారులపై కూడా సీబీఐ దష్టి పెట్టినట్టుగా మనీ కంట్రోల్ ఒక కథనంలో పేర్కొంది. వేలకోట్ల అవినీతిని ఆయా బ్యాంకు శాఖల ఇంటర్నల్ ఆడిటింగ్ సందర్భంగా కూడా ఆర్బీఐ ఎందుకు కనిపెట్టలేక పోయిదనే విషయంపై సీబీఐ వర్గాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఫిర్యాదు దారులతో సహా ఈ మెగా స్కాంలో ఎవ్వరూ విడిచిపెట్టేదిలేదని సీబీఐ పునరుద్ఘాటించింది.
స్కామ్కు రాజకీయ సెగ..
వేల కోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేసి సరిహద్దులు దాటేసిన నీరవ్ మోడీ అంశం దేశంలో కొత్త రాజకీయ వేడికి తెర తీసింది. మోడీ పాలనలో కార్పొరేట్ మోసాలు పెరిగిపో యాయని.. పీఎన్బీ కుంభకోణం వెనుక అధికార పార్టీ హస్తం ఉందని కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాల వారు ఆరోపి స్తుంటే. అసలు ఈ స్కామ్ యూపీఏ హాయాంలోనే మొదలై ందని.. అప్పటి పాలకులే దీనికి విత్తనం వేసి పోషించారని అధికార పార్టీ ఎదురు దాడికి దిగింది. ఈ నేపథ్యంలో భారీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ విచారణను డిమాండ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమ వుతోంది. ఈ మేరకు ప్రతిపక్షపార్టీలతో చర్చించనుంది. జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) పీఎన్బీ కుంభకోణాన్ని తీవ్రంగా ఖండించింది.