Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జవాబుదారీతనంతో పనిచేయాలంటే తప్పనిసరి : అసోచామ్
న్యూఢిల్లీ : విజయ్ మాల్యా, నీరవ్ మోడీ కుంభకోణాల అనంతరం అసోచామ్ అనుహ్యమైన డిమాండ్ చేసిం ది. ప్రభుత్వ రంగ బ్యాంకులపై అత్యధిక నియంత్రణను కేంద్రం వదులుకోవాలని సూచించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటు రంగ రుణదాతల మాదిరిగా పనిచేసేందుకు అనుమతించా లని కోరింది. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ''బ్యాంకుల్లోని వాటాలను 50 శాతం కన్నా తక్కువకు తగ్గించుకోవడానికి ప్రభుత్వం అనుమతించాలన్నది. బ్యాంకులు ప్రయివేటు రంగ రుణదాతల మాదిరిగా పనిచేసేందుకు అనుమతించాలి, వాటిలోని డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడుతూ, వాటి వాటాదారులకు సంపూర్ణ జవాబు దారీతనంతో నడిచేలా చేయాలి'' అని పేర్కొంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల సీనియర్ మేనేజ్మెంట్ హానికరం కానటువంటి అంశాలపై కూడా బ్యూరోక్రాట్ల నుంచి ఆదేశాలను తీసుకుని అమలు చేయడానికే తమ సమయంలో అధికంగా ఖర్చు చేస్తోందని ప్రస్తావించింది. ఈ ప్రక్రియలో ప్రధాన బ్యాంకింగ్ కార్యకలాపాలు, అన్ని ముఖ్యమైన నష్ట నివారణ చర్యలతో సహా, వెనుకబడుతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా బ్యాంకులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాయని, ఇది ఒక విధంగా వరం, మరో విధంగా శాపమని పేర్కొంది.