Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిజిటల్ ఇండియా దిశగా అడుగులు
- 'డబ్ల్యూఐటీసీ'లో ప్రధాని మోడీ మోదీ
డిజిటల్ ఇండియా దిశగా వర్థమాన భార తం పరుగులు తీస్తోం దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. హైదరాబాద్లోని హైటె క్స్ వేదికగా జరుగుతున్న 'వరల్డ్ ఐటీ కాంగ్రెస్'ను (డబ్ల్యూఐటీసీ) ఆయన సోమవారం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. భారత్తో తొలిసారిగా జరుగు తున్న డబ్ల్యూఐటీసీ సదస్సును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు భారత్, హైద రాబాద్ ఆహ్వానం పలుకుతోందని అన్నారు. ఈ రోజుల్లో కొత్తగా వస్తోన్న సాంకేతిక పరిజ్ఞానం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొంటోందని వివరించారు. డిజిటల్ ఆవిష్కరణ, నూతన ఆవిష్కరణలకు భారత్ ప్రధాన కేంద్రంగా నిలుస్తోందని వెల్లడించారు. డిజిటల్ ఇండియా లక్ష్యం గా దేశంలోని లక్ష గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో అనుసం ధానించామని ప్రధాని వెల్లడించారు. డిజిటల్ ఇండియా దిశగా కొనసాగు తోన్న మా ప్రయాణం.. కేవలం ప్రభుత్వంతోనే సాధ్యమయ్యే పని కాద న్నారు. ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు. 32 కోట్ల జన్ధన్ ఖాతాల ద్వారా రూ. 57 వేల కోట్ల సొమ్ము ప్రభుత్వానికి ఆదా అయిందని గుర్తు చేశారు. దేశంలో ఆరు కోట్ల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని ప్రధాని పేర్కొన్నారు. 470 వ్యవ సాయ మార్కెట్లను 'ఈ-నామ్'కు అనుసంధానించామని తెలిపారు. హైదరాబాద్ వేదికగా మూడురోజుల పాటు జరగనున్న ఐటీ కాంగ్రెస్కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ సంస్థల ప్రతినిధులు, ఐటీ నిపుణులతో పాటు ఐటీ పరిశ్రమ అనుబంధ సంస్థ వారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.