Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మతి తెలిపిన కేంద్ర సీసీఈఏ
- ప్రయివేటు, విదేశీ సంస్థలకు మేలు
- కోల్ ఇండియా అస్తిత్వానికి ముప్పు
న్యూఢిల్లీ: దేశంలోని అమూల్యమైన సహజ సంపదను ప్రయివేటు వ్యక్తలకు అంటగట్టే క్రమంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. బొగ్గుగనుల తవ్వకాల్లో ప్రయివేటు కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలను అనుమతించేందుకు గాను ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) మంగళవారం తన సమ్మతి తెలిపింది. ప్రయివేటు సంస్థలను అనుమతించేందుకు గాను అనుసరించాల్సిన విధివిధానాలు, అమ్మకాల విధానంతో పాటు పలు కీలక అంశాలలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ అనుమతి ప్రతిపాదనకు క్యాబినెట్ కమిటీ సమ్మతి తెలిపినట్టుగా సర్కారె వెల్లడించింది. 1973లో బొగ్గు గనులను జాతియికరణ చేసిన తరువాత బొగ్గు రంగంలో తీసుకు వచ్చిన కీలక సంస్కరణల్లో ఇది ముఖ్యమైందని సర్కారె వెల్లడించింది. ఈ మేరకు మైనింగ్ అండ్ మినరల్స్ (డెవెలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1957ను ఆమోదిచినట్టు కేంద్ర, రైల్వే, బొగ్గు శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. తద్వారా తక్కువ ధరకే విద్యుత్ లభించనుందని చెప్పారు. అయితే ఈ రూపంలో సర్కారు బొగ్గు తవ్వకాల్లో ప్రభుత్వ రంగం సంస్థ కోల్ ఇండియాకు చెక్ చెబుతూ కమర్షియల్ మైనింగ్కు గేట్లు తెరిచినట్లయింది. సర్కారు తాజా నిర్ణయంతో అదానీ గ్రూపు, వేదాంత, రియో టింటో, బీహెచ్పీ, ఆంగ్లో అమెరికన్, గ్లెన్కోర్ వంటి దిగ్గజ కంపెనీలకు మేలు కలుగనుంది. కొత్త విధానం బొగ్గు గనుల వేలాన్ని ఆన్లైన్ వేదికగా, పూర్తి పారదర్శకంగా జరపనున్నట్టుగా సర్కారు తెలిపింది. కొత్త సంస్థలు తమకు కేటాయించిన గనులను తొవ్వుకోవడం, అమ్మకాల వైపు సర్కారు నియంత్రణ ఏ మాత్రం ఉండబోదని సర్కారు తెలిపింది. దేశంలో 70 శాతం విద్యుత్తు ఉత్పత్తి బొగ్గు ఆదారంగానే జరుగుతోందని.. ఇప్పుడు కొత్త సంస్థలను మార్కెట్లోకి తేవడం వల్ల బొగ్గు ఉత్పత్తి పెరిగుతందని. విద్యుత్తు రంగంలో భద్రతకు ఈ చర్య దోహదం చేస్తుందని సర్కారు చెబుతోంది. మరో వైపు ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థ కోల్ ఇండియాకు సీసీఈ చర్యతో ముప్పు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. సర్కారు మాత్రం ఈ చర్యవల్ల కోల్ ఇండియా పనితీరు పోటీ తత్వంతో మెరుగుపరుచుకొనేందుకు దోహదం చేస్తుందని సర్కారు చెబుతోంది.