Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మరింతగా దిగివ చ్చింది. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరి నెలలో టోకు ద్రవ్యోల్బణం 2.48శాతంగా నమోదైంది. జనవరి నెలలో ఈ ద్రవ్యోల్బణం 2.84శాతంగా నమోదైన విషయం తెలిసిందే. ఆహార వస్తువల ధరలు తగ్గడంతో వరుసగా మూడో నెలల నుంచి టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. 2017 జులై తర్వాత డబ్ల్యూపీఐ ఇంతటి స్థాయికి తగ్గడం ఇదే తొలిసారి. 2017 డిసెంబరులో డబ్ల్యూపీఐ 3.58 శాతంగానూ.. 2018 జనవరిలో 2.84 శాతంగానూ నమోదు అయింది. ఇక ఇంధనం, విద్యుత్ టోకు ద్రవ్యోల్బణం జనవరిలో 4.08 శాతం మేర ఉండగా.. అది ఫిబ్రవరి నెలలో 3.81శాతానికి తగ్గాయి. ఇక డబ్ల్యూపీఐ ఉత్పాదక ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జనవరిలో 2.78శాతం ఉండగా.. గత నెలలో ఇది 3.04శాతానికి దిగి వచ్చింది.