Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ వర్గాల్లో కొత్త ఆందోళనలు
ముంబయి: టాటా సంస్థల రుణభారం అంతకంతకు పెరుగుతున్న వేళ.. బంగారు బాతుగా ఉన్న టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్లో (టీసీఎస్) వాటాను టాటా గ్రూపు విక్రయించడంపై మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టీసీఎస్లో దాదాపు రూ. 9,000 కోట్ల రూపాయల విలువైన 1.5 శాతం వాటాను బల్క్ డీల్ కింద గ్రూపు విక్రయించింది. విక్రేతలకు దాదాపు 5.9 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చి మరీ వాటాల విక్రయం జరపడం గమనార్హం. గుదిబండలా మారిన అప్పులను తీర్చడం కోసం, ఆటో, స్టీల్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం రూ.8,127 కోట్ల సమీకరణే లక్ష్యంగా సంస్థ ఈ విక్రయాన్ని చేపట్టింది. టాటా గ్రూపు నుంచి గత దశాబ్దకాలంలో ఇంత భారీ బల్క్డీల్ జరగడం ఇదే తొలిసారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్ వాటా విక్రయం బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకున్న సామెతగా ఉందని విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాటాను అమ్మి కొత్త అవకాశాలకోసం ఎదురు చూసే వ్యూహం బెడిసికొడుతుందనే నిపుణులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టాటా సన్స్ మొత్తం డివిడెండ్ ఆదాయంలో టీసీఎస్ వాటాయే 92శాతం..కార్యకలాపాల మొత్తం ఆదాయంలో ఈ సంస్థ వాటా 86 శాతానికి సమానం. కాగా..మరోవైపు ప్రమోటర్ ద్వారా వాటాల విక్రయం ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారి తీసింది. ఇలాంటి అమ్మకాలలో ఇది ఆఖరిది కాకపోవచ్చన్న ఆందోళన మార్కెట్ వర్గాల్లో నెలకొంది.