Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. అమెరికా, ఆసియా మార్కెట్లు ఎరుపెక్కడం.. ఆమెరికా వాణిజ్య యుద్ధం వంటి ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ను నష్టాలతో మొదలు పెట్టాయి. అనంతరం అమ్మకాల ఒత్తిడి తీవ్రతరం కావడంతో మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్ సెషన్లో సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల నష్టాల్లోకి జారింది. మరోసారి భారీ నష్టాలు తప్పవనే అంచనాలు వస్తుండగా.. ఐరోపా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో చివరి గంటలో మార్కెట్లు కోలుకున్నాయి. ఉదయం నష్టాలతోనే ప్రారంభమైన మార్కెట్లు చివరకు నష్టాలతోనే ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 21.04 పాయింట్లు నష్టపోయి 33,835.74 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 15.95 పాయింట్ల నష్టంతో 10,410.90 పాయింట్లకు వద్ద స్థిరపడింది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యస్ బ్యాంకు, టెక్ మహింద్రా, అంబుజా సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్ 3 శాతం వరకు లాభపడగా.. టాటా స్టీల్, ఐఓసీ, హెచ్డీఎఫ్సీ, హెచ్పీసీఎల్లు 3 శాతం మేర కిందకి పడిపోయాయి. మరోవైపు భారతి ఇన్ఫ్రాటెల్, హెచ్పీసీఎల్, హీరో మోటోకార్ప్, ఓఎన్జీసీ, టాటాస్టీల్ తదితర కంపెనీల షేర్లు నష్టాల్లోనే నిలిచాయి. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మదుపరులు లాభల స్వీకరణకు దిగడం కారణంగానే మార్కెట్లు బుధవారం ఆద్యంతం నష్టాల్లో కదలాడినట్టుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.