Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశంలోని బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్కు వేదికగా నిలిచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ముంబయి శాఖలోనే మరో మోసం వెలుగులోకి వచ్చింది. పీఎన్బీ బ్రాడీహౌస్ శాఖలో దాదాపు రూ.9.1 కోట్ల విలువైన స్కామ్ను సదరు బ్యాంకు అధికారులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించినట్టుగా సమాచారం. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ మాదిరిగానే.. అధికారుల సహకారంతో చంద్రీ పేపర్ అండ్ అలాయిడ్ ప్రోడక్స్ట్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ దాని ప్రమోటర్లు తాజా కుంభకోణానికి పాల్పడినట్టు సమాచారం. అయితే ఈ స్కామ్ సమాచారాన్ని ఇటు పీఎన్బీ అధికారులు గానీ.. అటు చంద్రీ పేపర్ సంస్థ ప్రతినిధులు గానీ ధ్రువీకరించలేదు.