Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లోనూ నష్టాల్లోనే నడిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీనమైన సంకేతాలతో.. ఉదయం 50 పాయింట్లకు పైగా నష్టాల్లో మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. చైనా దిగుమతులపై మరింత అమెరికా మరింతగా సుంకం విధించనుందని.. దీంతో ట్రేడ్వార్ ముదిరే అవకాశం ఉన్నట్టుగా వార్తలు రావడంతో అమెరికాతో సహా ఆసియా మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. ఈ నేపథ్యంలో మొదలైన దేశీయ మార్కెట్లు కూడా నష్టాలతోనే ట్రేడింగ్ను ప్రారంభించాల్సి వచ్చింది. బ్యాంకులతో సహా ఆర్థిక సేవల సంస్థల స్టాక్స్ మరింతగా కుంగాయి. దీంతో మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. యూరోపియన్ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ.. దేశీయంగా వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడికి సూచీ నష్టాల నుంచి బయటపడలేకపోయాయి. ఫలితంగా గురువారం నాటి ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు పడిపోయి 33,685 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా 51 పాయింట్లు కుంగి 10,360 వద్ద ముగిసింది. మదుపరులు ఆచితూచి ట్రేడింగ్ నిర్వహించడం కనిపించింది.