Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ , వాణిజ్యవిభాగం: శాంసంగ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి తీసుకువచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ ఫోన్లు తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ రెండు ప్రతిష్టాత్మకమైన ఫోన్లు శాంసంగ్ కేవలం బిగ్సీ ద్వారానే తెలుగు రాష్ట్రాల్లోకి విడుదలచేస్తున్నట్టుగా ఆ సంస్థ వ్యవస్థాపకులు, సీఎండీ బాలు చౌదరి తెలిపారు. ఇది తమకెంతో గర్వకారణంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంచలన మొబైల్స్ కొనుగోలుపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు లేదా పేటీఎం మాల్ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.6000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తున్నామని చౌదరి వెల్లడించారు. సులభ వాయిదాల పద్ధతిలో కూడా ఈ ఫోన్లను సొంతం చేసుకొనేలా బిగ్సీ తగిన వెసులుబాటును కల్పిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంసంగ్ అఖిల భారత వ్యాపారపు ఉపాధ్యక్షుడు ఉదరు భట్, సినీతార సమంత తదితరులు పాల్గొన్నారు.