Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న క్యాప్స్టన్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సంస్థ నిధుల సమీకరణ కోసం ప్రాథమిక మార్కెట్లోకి రానుంది. దాదాపు రూ.21.19 కోట్ల మేర నిధుల సమీకరణ నిమిత్తం ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూకు రానుందని ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది. వ్యాపార విస్తరణతో పాటు పెరుగుతున్న నిర్వహణ అవసరాలను తట్టుకొనేందుకు గాను సంస్థ ఐపీఓకు రావాలని భావిస్తున్నట్టుగా కంపెనీ యాజమాన్యం గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపింది. ప్రాథమికంగా ఎన్ఎస్ఈలో నమోదు కావాలన్న భావనతో ఉన్న కంపెనీ ప్రతిపాదిత ఐపీవోలో రూ.10ల ముఖ విలువ కలిగిన దాదాపు 23,04,000 ఈక్విటీ వాటాలను రూ.92ల ధరకు జారీ చేయనున్నట్టుగా సంస్థ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కె.శ్రీకాంత్ తెలిపారు. మొత్తం 26.5 శాతం ఈక్విటీ షేరు క్యాపిటల్కు సరిపడా మొత్తాన్ని ఆఫర్ ఫర్ సేల్, కొత్త షేర్ల జారీ ద్వారా మార్కెట్లలో అందుబాటులోకి తెనున్నట్టుగా సంస్థ యాజమాన్యం తెలిపింది. తమ కంపెనీ ఈ మార్చి ముగింపు నాటికి దాదాపు రూ.117 కోట్ల స్థూల ఆదాయాన్ని, రూ.6 కోట్ల మేర నికర లాభాన్ని ఆర్జించే అవకాశం ఉన్నట్టుగా కంపెనీ ఎండీ తెలిపారు. ఇష్యూకు ముందు సంస్థ పెయిడప్ క్యాపిటల్ రూ.7.54 కోట్లుగాను.. ఇష్యూ తరువాత రూ.8.54 కోట్లుగాను నిలవనున్నట్టుగాగా శ్రీకాంత్ వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు 400 మందికి పైగా క్లయింట్లను కలిగిఉన్న కాప్స్టన్ సంస్థలో దాదాపు 6,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.