Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సంస్థ అత్యాధునిక యాక్టివా స్కూటర్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. యాక్టివా వారసత్వాన్ని కొనసాగిస్తూ యాక్టివా 5జీ వాహనాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రామాణిక మోడల్ ధర రూ. 52,460 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) గాను.. డీలక్స్ వెర్షన్ ధర రూ. 54,325(ఎక్స్-షోరూమ్,ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. యాక్టివా 5జీ కొత్త అవతార్లో మార్పుల విషయానికి వస్తే.. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ డేలైట్స్ను పొందుపర్చింది. డీలక్స్ వెర్షన్లో కొత్త డిజిటల్ అనలాగ్ మీటర్, 3డీ ఎంబ్లమ్ను జోడించింది. 110 సీసీ నాలుగు-స్ట్రోక్ ఇంజిన్, 8 బీహెచ్పీ పవర్, 9ఎన్ఎం టార్క్తో ఈ వాహనం గంటకు గరిష్టంగా 83 కి.మీ వేగంతో పరుగులు తీయనుంది.
సీవీటీ గేర్బాక్స్, రియర్ మోనోషాక్స్, 10-అంగుళాల అల్లారు వీల్స్ విత్ 90/100 ట్యూబ్ లెస్ టైర్లు యాక్టివా 5జీలో ప్రధాన ఫీచరు. కొత్త 4 ఇన్ 1 లాక్ సిస్టమ్ ద్వారా సీట్ ఓపెనింగ్ స్విచ్ను ఏర్పాటు చేసింది. ఇక సీటు కింద అరలో మొబైల్ ఛార్జింగ్ పోర్టును అందిస్తోంది. యాక్టివా 5జీ గత మోడల్స్లాగే ఆరు రంగులతో పాటు కొత్తగా మెటాలిక్ బ్లూ, మెరిసే ఎరుపు రంగుల్లోనూ 5జీ మోడల్ లభించనుంది. స్కూటర్ల బుకింగ్స్ను ప్రారంభించామని డెలివరీలు వెంటనే మొదలుపెట్టలని నిర్ణయించినట్టుగా కంపెనీ తెలిపింది.