Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. అది మానవుడి ప్రత్యామ్నాయ స్థాయికి చేరలేదని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. శుక్రవారం సీఐఐ తెలంగాణ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన 'రీ ఇమాజినింగ్ అండ్ బిల్డింగ్ తెలంగాణ' అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన జాతిని నిర్మించేందుకు గాను పరిశ్రమ వర్గాలు, ప్రభుత్వం కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నరసింహన్ అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థికాభివృద్ధిలో పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయని.. ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. నాణ్యమైన విద్య, అందరికీ అందుబాటులో ఉండేలా వైద్యం అందించే విషయంలో పరిశ్రమలు ప్రభుత్వంతో కలిసి రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె.జోషి మాట్లాడుతూ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికిగాను ప్రభుత్వ ప్రయివేట భాగస్వామ్యానికి గల అవకాశాలపై పరిశ్రమ వార్గలతో చర్చించేందుకు సర్కారు సిద్ధంగా ఉందని అన్నారు. గత కొంత కాలంగా సీఐఐ అందించిన తోడ్పాటును ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సీఐఐ తెలంగాణ చైర్మెన్ వి. రాజన్న మాట్లాడుతూ గడిచిన ఏడాది కాలంలో సీఐఐ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పలు కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. సర్కారు విధానపరమైన నిర్ణయాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్, పెట్టుడుల ప్రోత్సహించడం, బ్రాండ్ తెలంగాణకు ప్రాచుర్యం కల్పించడం, ద్వితీయ శ్రేణి నగరాలకు ఆర్థికాభివృద్ధిని విస్తరింపజేయడంలో సర్కారుకు సీఐఐ దన్నుగా నిలుస్తూ వచ్చిందని వివరించారు.