Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్లో సంపద పంపిణి జరగట్లే..
- వృద్ధి సాధిస్తున్నా.. అందుకే ఇంకా పేదరికం
- అవినీతి ఆనవాళ్లు కొనసాగుతున్నాయి
- సేవల దన్నుతో వృద్ధి ఇండియా ప్రత్యేకత: 'రైజింగ్ ఇండియా' సదస్సులో నోబెల్ విజేత క్రూగ్మెన్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ అద్భుత పనితీరును కనబరుస్తూ వేగంగా ముందుకు సాగుతున్నప్పటికీ.. దేశంలో పెరుగుతోన్న ఆర్థిక అసమానతలు ఇంకా ఒక పెద్ద సమస్యగానే మిగిలిపోతోందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి విజేత పాల్ క్రూగ్మెన్ అన్నారు. న్యూస్18 సంస్థ ఏర్పాటు చేసిన 'రైజింగ్ ఇండి యా' సమిట్లో ఆయన మాట్లాడుతూ గడిచిన 30 ఏండ్లలో భారత ఆర్థిక వ్యవస్థ మేటిగా రాణిస్తూ ఎంతో పురోగమించిందని ఆయన వివరించారు. బ్రిటన్ 150 ఏండ్లలో సాధించినంత ప్రగతిని.. భారత్ గడిచిన 30 ఏండ్లలో సాధించి చూపిం దని ఆయన అన్నారు. భారత్లో ఆర్థిక పరివర్తన చాలా వేగంగా జరుగుతూ వస్తోందని అయినా.. ఇక్కడ పెదరికం తాడవిస్తుండడం శోచనీయమని ఆయన వివరించారు. ఇందుకు ప్రధాన కారణంగా దేశంలో ఘననీయంగా సంపద సృష్టి జరగుతున్నా.. ఆది సమాజంలోని అన్ని వర్గాల వారికి సమానంగా పంపిణీ జరగకపోవడమే ఇందుకు కారణమని ఆయన విశ్లేషించారు.
అవినీతి సమస్యగానే ఉంది...
భారత్లో ఆధికారిక అడ్డంకులు కాస్త తగ్గి ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతున్నప్పటికీ.. అవి పూర్తిగా సమిసిపోలేదని ఆయన అన్నారు. న్యూస్18 సంస్థ ఏర్పాటు చేసిన 'రైజింగ్ ఇండియా' సమిట్లో ఆయన మాట్లా డుతూ భారత్లో వినిమయ శక్తి అంతకంతకు పెరుగుతోందని.. ఫలితంగా ఇండియా ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తూ పోతోందని అన్నారు. ఇప్పటికే భారత జపాన్ ఆర్థిక వ్యవస్థను దాటేసి అమెరికా, చైనా సరసనన నిలిచిందని పేర్కొన్నారు. ఐరోపా దేశాల్లోని ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని ఆయన అన్నారు. సరైన సమయంలో భారత్లో సంస్కరణలు చేపట్టడం, పరిస్థితులకు అనుగుణంగా భారత్ అవకాశాలను చేజిక్కించుకోవడం వల్లే భారత్ నేడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సరసన చేరిందని ఆయన వివరించారు. భారత్లో అవినీతి ఇంకా సమస్యగానే ఉందని ఆయన వివరించారు.
మౌలిక సమస్య అలాగే ఉంది..
భారత్లో వ్యాపారానుకూల వాతావరణం తీసుకు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని పాల్ అన్నారు. సేవల ప్రపంచీకరణ నుంచి లబ్దిపొందే విషయంలో భారత్ ముందంజలో ఉందని ఆయన వివరించారు. సేవల రంగం దన్నుతో ఆర్థిక వ్యవస్థ ఇంత మెరుగైన పనితీరును కనబరచడం ప్రపంచంలో ఎక్కడా అగుపించలేదని ఆయన తెలిపారు. గ్లోబలైజేషన్ తరువాత క్రమంలో కూడా భారత్ ఇదే దూకుడుతూ ముందుకు సాగే అవకాశం ఉందని అన్నారు.
ఉద్యోగకల్పన లేకుంటే అంతా ఉత్తదే..
భారత ఆర్థిక వ్యవస్థ మిగతా ప్రపంచ దేశాలకంటే మేటిగా రాణిస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ దేశంలో తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే విషయంలో అశ్రద్ధ తగదని పాల్క్రూగ్మెన్ హెచ్చరించారు. ఎంతో మేటి వృద్ధిని అంచనా వేస్తున్నప్పటికీ తగిన ఉద్యోగ, ఉపాధికల్పన లేకుంటే స్థిరమైన వృద్ధి సాధించడం కష్టమేనని ఆయన అన్నారు. ఉద్యోగ కల్పన లేనిది ఎంత వృద్ధి సాధించినా అది ఎక్కవ కాలం నిలవజాలదని ఆయన విశ్లేషించారు. కావున విధాన నిర్ణేతలు, పాలకులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.