Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు ప్రక్రియ అతిపెద్ద అబద్ధమని కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి చిదంబరం అభివర్ణించారు. కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో రెండోరోజు ఆయన పాల్గొన్నారు. పార్టీ ఎకానమిక్ పాలసీపై ప్రసంగించిన అనంతరం మాట్లాడుతూ... నోట్లరద్దు కంటే అతిపెద్ద అబద్ధం మరొకటి లేదని దాని వల్ల ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. అలాగే జీఎస్టీని అమలు చేయడం ద్వారా ప్రజల్ని పేదరికంలోకి నెట్టివేసిందని కేంద్రాన్ని విమర్శించారు. నోట్ల రద్దు చేపట్టిన అనంతరం నల్లధనం ఎంతమేరకు వెలికి వచ్చిందనేది ఆర్బీఐ ఇప్పటికీ చెప్పలేదని అన్నారు. బ్యాంకులకు ఎంత డబ్బు చేరిందో ఇకపై వారు చెప్పబోరని తెలిపారు.