Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నుజ్జు నుజ్జుగా చేసి దిమ్మెల తయారీ: ఆర్బీఐ
న్యూఢిల్లీ: రద్దు చేసిన నోట్లను రీసైకిల్(తిరిగి వాడటం) చేయట్లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన తర్వాత వాటిని నుజ్జు నుజ్జుగా చేసి దిమ్మెలను తయారు చేస్తున్నారని ఓ ఆర్టీఐకి సమా ధానంగా ఆర్బీఐ తెలిపింది. అనేక ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యంత్రాలతో దిమ్మెలను తయారుచేస్తున్నా రని వివరించింది. దిమ్మెల తయారీ పూర్తయ్యాక వాటిని ఎంచుకున్న మార్గాల్లో వినియోగిస్తున్నామని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆర్బీఐ కార్యాలయాల్లోని దాదాపు 59 కరెన్సీ వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ యంత్రాలతో రద్దు చేసిన నోట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగు తోందని తెలిపింది. ఈ ప్రాసెస్ అయిన నోట్లతో దిమ్మెలను తయారు చేస్తున్నట్టు వివరిం చింది. పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత 2017 జూన్ 30వరకు 15.28 లక్షల కోట్ల రూపాయలు తిరిగి వచ్చాయని ఆర్బీఐ 2016-17 వార్షిక నివేదికలో ప్రకటించిన విషయం తెలిసిందే.