Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బంధన్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ కు ప్రాథమిక మా ర్కెట్లో చక్కటి స్పందన లభిం చింది. సోమవా రంతో ముగిసిన ఈ ఐపీవోకు మదుపరుల నుంచి దాదాపు 14.62 రెట్లమేర అద్భుత స్పందన లభించింది. బ్యాంక్ ఆఫర్కు ఉంచిన 8,34,96,347 షేర్లకు దాదాపు 1,22,10,47,920 బిడ్లు దాఖలు అయిన ట్టుగా స్టాక్ మార్కెట్ డేటా చెబుతోంది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరు ను సంస్థ రూ.370-375 ధరల శ్రేణితో ఐపీవోకు ఉంచింది. అర్హత కలిగిన సంస్థా గత కొనుగోలుదారుల కోటాకు అత్యధికంగా దాదాపు 38.68 రెట్ల స్పందన లభించింది. రిటైల్ ఇన్వెష్టర్ల విభాగంలో 1.19 రెట్ల స్పందన వచ్చిందని మార్కెట్ డేటా ప్రకారం తెలుస్తోంది.