Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్ఫోసిస్ చైర్మెన్ నిలేకని ఉచిత సలహా
ముంబయి: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలువ పడిపోక ముందే వాటిని ప్రయివేటీకరించాలని ఇన్ఫోసిస్ చైర్మెన్ నందన్ నీలేకని సర్కారుకు సూచించారు. ప్రస్తుతం బ్యాంకులు ప్రయివేటె కంటే మంచి పని తీరుతో మార్కెట్లో ఆధిక్యకర స్థాయిలో ఉన్నాయని.. వాటి విలువ ఏటా నాలుగు శాతం మేర తగ్గుతూ వస్తోందన్న అంచనాల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల విలువ 70 శాతం వరకు ఉందని.. రానున్న పదేండ్లలలో ఈ విలువ తగ్గుతూ వచ్చి 10 శాతం దరిదాపుల్లోకి చేరవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ టెలికాం రంగంలో జరిగినట్టుగానే.. బ్యాంకింగ్ రంగంలోనూ పరిణామాలు చోటు చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఒకప్పుడు టెలికాం రంగంలో ఏకఛత్రాధిపతిగా వెలుగొందిన బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం ప్రయివేటు సంస్థల దాటికి తట్టుకోలేక పోతోందని.. ఈ నేపథ్యంలో ఆ సంస్థ చిన్న టెలికాం స్థాయికి చేరకుందని అన్నారు. విమానయాన రంగంలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఎయిరిండియా నేలకొరగి మనుగడ కోసం పోరాడుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బ్యాంకింగ్ రంగానికి కూడా ఇలాంటి పరిస్థితి రాకమునుపే తగిన చర్యలు తీసుకుంటే మేలని ఆయన అన్నారు.
ప్రజలే బ్యాంకుల్నికొనుగోలు చేసుకొని స్వేచ్ఛగా నిర్వహించుకోనిస్తే అద్భుత పలితాలుంటాయని అభిప్రాయ పడ్డారు. బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తూ వస్తోందని. బ్యాంకులు విజయవంతంగా నిలిచేందుకు గాను టెక్నాలజీ ప్రముఖ పాత్ర పోషిస్తోందని అన్నారు. ఆధునిక టెక్నాలజీని వీటిని ప్రయివేటు రంగ బ్యాంకులు చురుగ్గా అందిపుచ్చుకొని ఖాతాదారులను ఆకట్టుకొనే దిశగా వేగంగా పావులు కదుపుతున్నాయని అన్నారు.