Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాభాల స్వీకరణతో తగ్గిన ప్రాఫిట్స్
ముంబయి: వరుస నష్టాలతో సతమతమవుతున్న మార్కెట్లకు బుధవారం భారీ ఊరట లభించింది. ఇటీవలి కాలంలో మార్కెట్ల వరుస పతనాల నేపథ్యంలో చాలా స్టాక్స్ ధరలు అందుబాటు ధరల్లోకి రావడం.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అనుకూల పవనాలు రావడం.. దేశంలో రాజకీయ అవిశ్వాసంపై నీలినీడలు దూరం అవుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు బుధవారం పరుగులు తీశాయి. ఇంట్రాడేలో దాదాపు 300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్, చివరికి మదుపరుల లాభాల స్వీకరణకు దిగడంతో 139 పాయింట్ల లాభంలో 33,136 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్ల లాభంలో 10,155 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు ఆద్యంతం సానుకూలంగానే ట్రేడయ్యాయి. ట్రేడింగ్ చివర్లో ఫెడ్ భయాలు, లాభాల స్వీకరణతో మార్కెట్లు కొంత లాభాలను పోగొట్టుకున్నాయి. ఔషధ, లోహ, మీడియా సంస్థల షేర్లు నష్టాల్లో నడవగా.. స్థిరాస్తి రంగం దాదాపు 0.8 శాతం మేర పైకెగిసింది. బ్లూచిప్స్లో ఎయిర్టెల్ 4.3 శాతం లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఐబీ హౌసింగ్, బీపీసీఎల్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, అల్ట్రాటెక్, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ 2.5-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే టాటా స్టీల్, హీరోమోటో, ఐషర్, అదానీ పోర్ట్స్, ఇన్ఫ్రాటెల్, అరబిందో, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా 2-1 శాతం మధ్య కుంగాయి.