Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా: మోడీ సర్కారు నోట్లరద్దును ఎందుకు చేపట్టిందో తనకు ఇప్పటి వరకు అర్థం కాలేదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి అన్నారు. ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో నారాయణ మూర్తి మాట్లాడుతూ తన విశ్లేషణ ప్రకారం పెద్దనోట్ల రద్దు చర్యను పట్టణ మేధావులు చాలా మంది అంగీకరించనప్పటికీ.. గ్రామీణ భారతంలో అత్యధికులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారని వివరించారు. తాను వాస్తవానికి ఆర్థిక శాస్త్ర నిపుణుడిని కాదని..తన ద ష్టికి వచ్చిన అంశాల్ని మాత్రమే చెబుతున్నట్టుగా వివరించారు. దేశంలో దాదాపు 75 శాతం మంది చిన్నారులు పాఠశాలకు వెలుతున్నా అందులో చాలా మంది 8వ తరగతికి వచ్చే సరికి డ్రాపవుట్గా మిగిలి పోతున్నారని అన్నారు. వీరు 22 ఏండ్లకు వచ్చే సరికి ఉపాధి కోసం ఉద్యోగ అన్వేషణకు వస్తున్నారని తెలిపారు. పెద్ద చదువులకు పోని కారణంగా వీరు ఎక్కువగా తక్కువ టెక్నాలజీతో కూడిన ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారని నిరుద్యోగులుగా మారిపోతున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా జపాన్, చైనాల మాదిరిగా తక్కువ టెక్నాలజీతో కూడిన తయారీ రంగంపై మొదటి నుంచి దృష్టి సారించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.