Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గత కొద్ది రోజులుగా వరుసగా పడిపోతున్న స్టాక్ మార్కె ట్ల వల్ల దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్ఐసి భారీగానే నష్టపో యింది. ముఖ్యంగా 53 ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాల వల్ల ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు రూ.20,000 కోట్ల నష్టాలు వాటిలినట్లు సమాచారం. 2018లో ఇప్పటి వరకు ప్రతీ 10 పిఎస్యుల్లో తొమ్మిది పిఎస్యులు దాదాపుగా 40 శాతం వరకు మార్కెట్ విలువను నష్టపోయాయి. ప్రధానంగా కార్పొరేషన్ బ్యాంకు, భెల్, పంజాబ్ నేషనల్ బ్యాంకులు 19 శాతం వరకు నష్టపోయాయని కాపిటలైన్ పేర్కొంది. కోల్ ఇండియా, సెంట్రల్ బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు సూచీలు నష్టాలను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా పిఎన్బి కేసు వల్ల బ్యాంకుల సూచీలు దెబ్బతినడంతో ఎల్ఐసి ఎక్కువగా నష్టపోయింది.