Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మార్చితో ముగియనున్న నాలుగో త్రైమాసికం (క్యూ4)లో భార త కరెంట్ ఎకౌంట్ లోటు (సీఏడీ) మూడు రెట్లు పెరి గి 10-12 బిలియన్ డాలర్లకు చేరొచ్చని రేటింగ్ ఎజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అధిక వాణిజ్య లోటుతో ఈ పరిస్థితి చోటు చేసుకోనుందని పేర్కొంది. జిడిపిలో సీఏడీ 13.5 బిలియన్ డాలర్లతో రెండు శాతానికి చేరనుందని తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జిడిపిలో సిఎడి 8 బిలియన్ డాలర్లతో 1.4 శాతంగా ఉంది. ఇక్రా అంచనాల ప్రకారం 2017-18లో మొత్తంగా సీఏడీ 46-48 బిలియన్ డాలర్లకు ఎగియనుంది. ఇది జిడిపిలో 1.8 శాతంగా ఉండనుంది.
2016-17లో 15.2 బిలియన్లతో 0.7 శాతంగా ఉంది. 2018-19లో భారత ఎగుమతులు 335-340 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో దిగుమతులు 505-510 బిలియన్లుగా ఉంది. దీంతో భారత వాణిజ్య లోటు 170-175 బిలియన్ డాలర్లకు చేరనుందని ఇక్రా అంచనా వేసింది. 2018-19లో 45-50 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నమోదు కావొచ్చు. 2018లో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 64-66గా ఉండొచ్చు.