Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 130 పాయింట్ల పతనం
ముంబయి : వరుస నష్టాల నుంచి గట్టెక్కి రెండు రోజులు లాభా ల్లో నమోదైన దేశీయ స్టాక్ మార్కె ట్లు మళ్లీ చతికిల పడ్డాయి. మార్చి మాసం డెరివేటివ్స్ కాంట్రాక్టు గడు వు ముగింపునకు తోడు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచనున్న ట్లు వార్తలు రావడంతో మార్కెట్లు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. ఈ పరిణా మాల మధ్య గురువారం బిఎస్ఇ సెన్సెక్స్ 129.91 పాయింట్లు లేదా 0.39 శాతం క్షీణించి 33,006.27కు పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 40.50 పాయిం ట్లు తగ్గి 10,114,75కు క్షీణించింది. బ్యాంకింగ్, విత్త సంస్థల సూచీలు అత్యధికంగా నష్టాలను ఎదుర్కొన్నాయి. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంకు సూచీలు రెండు శాతం మేర విలువ కోల్పోయాయి. రంగాల వారిగా నిఫ్టీలో రియాల్టీ 1.21 శాతం, బ్యాంకింగ్ 0.47 శాతం, ఆటో 0.89 శాతం, ఐటి 0.95 శాతం చొప్పున నష్టాలను ఎదు ర్కొన్నాయి. కా గా లోహ సూచీ మాత్రం 0.32 శాతం పెరిగింది. సెన్సె క్స్-30లో ఎస్బిఐ 2.58 శాతం, విప్రో 2.32 శాతం, మారుతి సుజుకి 2.11 శాతం, ఐసిఐసిఐ బ్యాంకు 2.07 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.98 శాతం, అదానీ పో ర్ట్సు 1.62 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూశాయి. మరోవైపు ఒఎన్జిసి 2.45 శాతం, ఇండుస్ఇండ్ బ్యాంకు 1.41 శాతం, రిలయన్స్ 1.31 శాతం, టాటా మోటార్స్ 1.23 శాతం, సన్ ఫార్మా 0.85 శాతం, ఆసియన్ పెయింట్స్ 0.56 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.