Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది జనవరిలో టెలికం వినియోగదారుల సంఖ్య 117 కోట్లకు తగ్గిందని ట్రారు ఒక రిపోర్టులో వెల్లడించింది. ఇంతక్రితం డిసెంబర్లో ఈ సంఖ్య 119 కోట్లుగా ఉంది. దీంతో పోల్చితే గత జనవరి మాసం వినియోగదారుల్లో 1.32 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. రిలయన్స్ జియోలో కొత్తగా 83 లక్షల మంది, భారతీ ఎయిర్టెల్లో 15 లక్షల మంది, వొడాఫోన్లో 13 లక్షల మంది, ఐడియా సెల్యూలర్లో 11 లక్షల మంది చొప్పున చేరారు. బీఎస్ఎన్ఎల్లో 39వేల మంది చేరడంతో టెలికం రంగంలో ఆ సంస్థ వాటా 9.4 శాతంగా నమోదయ్యింది.