Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : రుణభారంతో సతమతమవుతున్న భూషణ్ స్టీల్ను టాటా స్టీల్ స్వాధీనం చేసుకోనుంది. దాదాపుగా రూ.50వేల కోట్ల రుణభారంతో ఉన్న దివాలా చట్ట పరిధిలోకి చేరిన భూషణ్ స్టీల్ కొనుగోలుకి వేసిన బిడ్లో తాము సాధించుకున్నట్టు టాటా స్టీల్ శుక్రవారం స్టాక్ ఎక్సేంజీలకు సమాచారమిచ్చింది. ఈ మేరకు మార్చి 22న భూషణ్ స్టీల్ లిమిటెడ్ (బీఎస్ఎల్) కు చెందిన క్రెడిట్ కమిటీల నిర్ణయం తీసుకుందని ఇందులో తెలిపింది. దీనికి ఇంకా ఎన్సీఎల్టీ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తదితర నియంత్రణ సంస్థల నుంచి తగిన అనుమతులు లభించాల్సి ఉందని టాటాస్టీల్ వెల్లడించింది. రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో భూషణ్ స్టీల్పై బ్యాంకులు దివాలా చర్యలు చేపట్టాయి. వార్షికంగా 5.6 మిలియన్ టన్నుల సామర్థ్యమున్న భూషణ్ స్టీల్ కొనుగోలుకు పలు సంస్థలు ఆసక్తి చూపాయి. ఈ కంపెనీ కోసం జేఎస్డబ్ల్యూ రూ.29,700 కోట్ల బిడ్ వేయగా, టాటా స్టీల్ రూ.35వేల కోట్లతో ముందుకు వచ్చి సాధించుకుంది.