Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ జిగేలుమన్నాయి. అనూహ్యంగా చివరి గంటలో ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగ స్టాక్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు, ఏప్రిల్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో గురువారం ప్రారంభం నుంచే దేశీయ స్టాక్ మార్కెట్లు స్తబ్దుగా కదలా డాయి.. చివరి గంటలో ఐరోపా మార్కెట్ల నుంచి అందిన సానుకూలత నేపథ్యంలో తాజా కొనుగోళ్ల అండతో ఒక్కసా రిగా దూసుకెళ్లాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్ నాలుగేళ్ల సరికొత్త గరిష్టమైన 3.035 శాతాన్ని తాకడానికి సిద్ధంగా ఉండటంతో, గ్లోబల్ మార్కెట్లన్నీ మంచి లాభాల్లో ముందు కు సాగాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభప డగా.. నిఫ్టీ మళ్లీ 10,600 మార్క్ను దాటేసింది. ఉదయం దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు నేపథ్యంలో ఒకింత ఒడుదొడుకులను ఎదుర్కొన్న సూచీలు చాలా సేపటి వరకు నెమ్మదిగా సాగాయి. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలోనూ సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయ్యింది. అయితే ఒక్కసారిగా సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. మార్కెట్ ముగిసే సమయానికి 212 పాయింట్లు ఎగబాకి 34,714 వద్ద స్థిరపడింది. ఇది దాదాపు మూడున్నర నెలల గరిష్టం కావడం గమనార్హం. అటు నిఫ్టీ కూడా 47 పాయింట్ల లాభంతో 10,618 పాయింట్ల వద్ద ముగిసింది.