Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గడిచిన ఆరు నెలల కాలంలో దేశంలో ఉద్యోగ అవకాశాలు మెరుగు పడినట్టుగా ప్రభుత్వ తన తాజా గణాంకాల్లో వెల్లడించింది. గత ఆరు నెలల్లో (ఫిబ్రవరి 28 వరకూ) దేశంలో దాదాపు 22 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయని ఈపీఎఫ్ఓ, ఎన్పీఎస్లు జారీ చేసిన తాజా పేరోల్ జాబితా ద్వారా తెలుస్తోందని సర్కారు తెలిపింది. ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం 31 లక్షల మంది ఉద్యోగులు కొత్తగా ఖాతా తెరిచారని..వీరిలో 18.5 లక్షల మంది 18-25 సంవత్సరాల వయసు మధ్య వారున్నారని, వీరంతా కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారనన్నది సర్కారు అంచనా. ఇక 3.5 లక్షల మంది కేంద్ర ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులు నూతన ఖాతాలు తెరిచారని ఈ రెండింటినీ కలుపుకుని దేశంలో కొత్తగా 22 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని తేల్చింది. ఈపీఎఫ్ఓ, ఎన్పీఎస్తో పాటు ఉద్యోగుల ఆరోగ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) సైతం గణాంకాలను వెల్లడింది. గత ఆరునెలల్లో ఈఎస్ఐసీ కొత్తగా 18-25 సంవత్సరాల వయసున్న 8.3 లక్షల మందికి బీమా ఛత్రం కల్పించినట్టు ప్రకటించింది. ఆధార్ వెరిఫికేషన్ ద్వారా వీరు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారని వెల్లడైతే గత ఆరునెలల్లో 30 లక్షల మందికి పైగా ఉపాధి లభించిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం యథాతథమేనన్న అంసతృప్తి వినవస్తోంది.