Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషల్ మీడియా వేదికగానూ నియామకాలు
- రిలయన్స్ జియో చీఫ్ హెచ్ఆర్ సంజరు జోగ్
నవతెలంగాణ-వాణిజ్య విభాగం : దేశీయ టెలికాం రంగంలో సంచలనంగా దూసుకొచ్చిన రిలయన్స్ జియో సంస్థ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాము కొత్తగా 75,000 నుంచి 80,000 మందిని కొలువుల్లోకి తీసుకోనున్నట్టుగా ప్రకటించింది. హైదరాబాద్లో సోసైటీ ఆఫ్ హ్యూమెన్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కంపెనీ ప్రధాన మానవ వనరుల అధికారి సంజరు జోగ్ మాట్లాడుతూ ప్రస్తుతం జియోలో మొత్తం 1,57,000 మంది ఉద్యోగులు ఉన్నట్టుగా తెలిపారు. వీరికి అదనంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 75,000 నుంచి 80,000 మందిని కొలువుల్లోకి తీసుకోన్నుట్టుగా వివరించారు. రిలయన్స్ జియోలో ప్రధానంగా అమ్మకాలు, సైట్ల నిర్మాణంలోని టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగుల వలసలు 32 శాతంగా ఉన్నట్టు ఆయన వివరించారు. ప్రధాన కార్యాలయంలో చూస్తే వలసలు 2 శాతంగా నమోదు అవుతున్నట్టుగా తెలిపారు. సగటున సంస్థలో ఉద్యోగుల వల సలు 18 శాతమని వివరించారు. జియో సంస్థ ఉద్యోగులను ఎంపిక చేసుకొ నేందుకు గాను మొత్తం 6000 కాలేజీలతో జట్టుకట్టి ఉందని ఆయన అన్నారు. ఇందులో సాంకేతిక విద్యను అందించే సంస్థలు కూడా ఉన్నట్టుగా తెలిపారు. కొన్ని సంస్థలు ఎంబెడెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయని అన్నారు. ఈ కోర్సు లను పూర్తి చేసుకున్నవారు 'రిలయన్స్ రెడీ'గా అందుబాటులో ఉండనున్నట్టుగా వివరించారు. తమ సంస్థలో సిఫారసుల ఆధారంగా కూడా కొత్త వారిని కొలువు ల్లోకి తీసుకుంటున్నట్టుగా జోగ్ తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కూడా కొత్త నియామకాలు చేపడుతున్నట్టు ఆయన వివరించారు. రిలయన్స్ జియోలో చేపట్టే కొత్త నియామకాల్లో 60 నుంచి 70 శాతం వాటా సంస్థ ఉద్యోగులు, కాలేజీల రిఫరల్స్ మేరకే జరుపుతున్నట్టుగా ఆయన వెల్లడించారు. రిలయన్స్ జియా నియామక ప్రణాళికలో ఈ రెండు మార్గాల ద్వారా జరిపే నియామకాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా ఆయన వివరించారు.
4 కోట్ల ఫీచర్ఫోన్ల విక్రయం
దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ల విభాగంలోనూ తన సత్తా చాటుతోంది. 4జీ రంగంలో ఇప్పటికే మార్కెట్ దిగ్గజంగా ఎదిగిన జియో సంస్థ గ్రామీణ ప్రాంతాలు, ఫీచర్ ఫోన్ వాడకందారులను లక్ష్యంగా చేసుకొని మార్కెట్ను పెంచుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 'జియోఫోన్' పేరుతో ప్రత్యేకమైన ఫీచర్ ఫోన్ను గతేడాది జులైలో సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త ఫోన్లు అందుబాటులోకి వచ్చి ఏడాది కూడా కాకముందే సంస్థ ఇప్పటివరకు అక్షరాలా 4 కోట్ల ఫోన్లను విక్రయించినట్టుగా భారత టెలికాం రంగంపై 'క్రెడిట్ సూయిస్' అనే ఆర్థిక సంస్థ ఇటీవల జరిపిన ఒక సర్వేలో తేలింది. ఈ ఏడాదిలో జియోఫోన్ తన మార్కెట్ను బాగా విస్తరించుకుందని సర్వే తెలిపింది. జనవరి-మార్చి మధ్య ఫీచర్ ఫోన్ మార్కెట్లో జియోఫోన్ షేరు 36 శాతంగా ఉందని పేర్కొంది. ఈ త్రైమాసికంలో ఏకంగా 2.1కోట్ల ఫోన్లను విక్రయించినట్లు తెలిపింది. మొత్తంగా ఫోన్ను విడుదల చేసిన నాటి నుంచి ఈ ఏడాది మార్చి వరకూ 4 కోట్లకు పైగానే జియోఫోన్లు అమ్ముడైనట్లు సర్వే వెల్లడించింది. చాలా మంది వినియోగదారులు తమ రెండో మొబైల్గా జియోఫోన్ను ఎంచుకుంటున్నట్లు సర్వే తెలిపింది. త్వరలో ఈ ఫోన్లో వాట్సాప్ ఫీచర్ కారణంగా ఎక్కువ మంది ఈ ఫోన్లవైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలిపింది.