Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) తెలుగు రాష్ట్రాల్లో మరింతగా విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత సంవత్సరం మరో ఎనిమిది కొత్త శాఖలను ఏర్పాటు చేయనున్నట్టుగా ఆ బ్యాంక్ చైర్మెన్ నర్సీరెడ్డి వెల్లడించారు. తమకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 768 శాఖలున్నాయని నర్సిరెడ్డి అన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 278, తెలంగాణలో 490 చొప్పున శాఖలతో విస్తరించి సేవలంది స్తున్నామన్నారు. 2017-18లో బ్యాంక్ 42.90 శాతం వృద్ధితో రూ.503.01 కోట్ల నికర లాభాలు ఆర్జించిందని నర్సిరెడ్డి వెల్లడించారు. ఇంతక్రితం ఏడాది బ్యాంక్ లాభాలు రూ.351.99 కోట్లుగా ఉన్నాయి. 2017-18లో 11.82 శాతం వృద్ధితో రూ.14,333 కోట్ల డిపాజిట్లు, మొత్తంగా రూ.13.75 శాతం వృద్ధితో రూ.28,650.33 కోట్ల వ్యాపారాన్ని సాధించినట్టుగా తెలిపారు.