Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 నెలల కనిష్టానికి పతనం
ముంబయి: కర్నాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లతో పాటు రూపాయి మారకం విలువ కూడా తీవ్రంగా ప్రభావితమైంది. మంగళవారం విడుదలైన కన్నడ ఫలితాల్లో ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ రాకపోవడం ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపింది. భాజపాకు ఎదురుగాలి నేపథ్యంలో మోడీ సర్కారుపై మదుపరులకున్న విశ్వాసం సడలింది. ఇక సంస్కరణలకు బ్రేక్ పడనుందన్న వార్తల నేపథ్యంలో వారు భారీగా స్టాక్స్ను విక్రయించారు. వీరికి తోడు విదేశీ మదుపరులు భారీగా స్టాక్స్ను వదిలించు కొనేందుకు ఆసక్తి చూపండంతో డాలర్తో రూపాయి మారకం విలువ 2017 జనవరి స్థాయికి పడిపోయి 68 మార్కుకు క్షీణించింది. అంతకు ముందు ముగింపు కంటే కూడా రూపాయి మంగళవారం మరో 59 పైసలు పడిపోయి రూ.68.11 గరిష్ట స్థాయికి చేరింది. 2018లో ఇది రూపాయి రెండో అతిపెద్ద పతనం కావడం విశేషం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ వద్ద పౌండ్ స్టెర్లింగ్ కూడా రూ.91.28/92.00 వద్ద క్లోజైంది. మరోవైపు గత కొన్ని రోజులుగా కూడా ముడి చమురు ధరలు పెరుగుతుండటం రూపాయి విలువను దెబ్బతీస్తూ ఉంది.