Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంకులో (పీఎన్బీ) భారీ మోసానికి సంబంధించి నకేసులో ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చౌక్సీపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ను దాఖలు చేసింది. సీబీఐ దర్యాప్తులో మెహుల్ చౌక్సీ ఆయన ఆధీనంలోని గీతాంజలి గ్రూప్ సంస్థలు పీఎన్బీ బ్యాంకులో వేలాది కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్టుగా తేలడంతో సీబీఐ ఛార్జిషీట్ను తయారు చేసింది. దీనిని బుధవారం ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో చౌక్సీకి చెందిన కంపెనీలతోపాటు మరో 16 సంస్థలు కూడా భాగస్వాములుగా సీబీఐ పేర్కొంది.