Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన మాట నిలుపుకోవడంలో సహారా సంస్థ మరోమారు విఫలమైంది. సెబీ-సహారా రీఫండ్ ఖాతాలో రూ.750 కోట్లు జమ చేయడంలో ఆ సంస్థ విఫలమైన నేపథ్యంలో సహారా గ్రూప్లోని ప్రతిష్టాత్మకమై ఆంబీ వ్యాలీలో ఆస్తుల వేలాని ముందుకు తీసుకుపోనున్నట్టుగా సుప్రీ కోర్టు స్పష్టం చేసింది. రీఫండ్ ఖాతాలో సొమ్ము డిపాజిట్ చేసేందుకు ఇచ్చిన ఆఖరి గడువు మంగళవారంతో ముగిసింది. గడువులోపు డబ్బులు జమ చేయడంలో తాము విఫలమైనట్టు సహారాకు ప్రాతినిథ్యం వహిస్తున్న న్యాయవాది వికాస్ సింగ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోరు, జస్టిస్ ఏకే సిక్రి నేతృత్వంలోని ధర్మాసనానికి వెల్లడించారు. దీంతో ఆస్తుల వేలం కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది. బుధవారం లోపు ఆస్తులను సొంతంగా విక్రయించుకోవచ్చని లేదంటే వేలం వేస్తామని కోర్టు అంతకు ముందు సహారాకు స్పష్టంగా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు అధికారిక లిక్విడేటర్ వేలం ప్రక్రియ ఆరంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఆంబీ వ్యాలీ వేలం కొరకు మే 21 నుంచి 31 వరకు బిడ్లను ఆహ్వానిస్తామని జూన్ 2 నుంచి వేలం ప్రారంభిస్తామని లిక్విడేటర్ తెలిపారు.