Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జపాన్కు చెందిన కార్ల తయారీ దిగ్గజం హోండా ఆధునికరించిన కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు విడుదల సందఠంగా తొలి 20,000 కస్టమర్లకు ప్రత్యేక ధరను ప్రకటించింది. వేరియంట్ను బట్టి ఈ ఆఫర్ ధర రూ. 5.59లక్షల నుంచి రూ.8.99 లక్షల మధ్య ఉంటుందని హోండా సంస్థ పేర్కొంది. దేశ వ్యాప్తంగా పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.5.59లక్షల నుంచి రూ.7.99 లక్షల వరకు, డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.69 లక్షల నుంచి రూ.8.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. పెట్రోల్ వేరియంట్కు 1.2లీటర్ 4సిలిండర్ ఇంజిన్, 5స్పీడ్ మాన్యూవల్ గేర్, 7-స్టెప్ సీవీటీ ఆటోమేటిక్, సీవీటి తొలిసారిగా పెడల్షిఫ్టర్ను కూడా అమర్చారు. కొత్త అమేజ్ నందు బాహ్యడిజైన్, ఇంటీరియర్లో కూడా చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 7 అంగుళాల టచ్స్క్రీన్ ఉన్న డిజిపాడ్-2 ఇన్ఫోటైన్మెంట్ను అమర్చారు. దీనిలో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సౌకర్యాలు ఉన్నాయి. స్టార్ట్-స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమెంట్ కంట్రోల్ , వెనుక సీట్లకు ఏసీ సౌకర్యం ఏర్పాటు చేశారు. లీటర్ పెట్రోల్కు ఈ కొత్త అమేజ్ 19.5 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇక డీజిల్ వేరియంట్లో 1.5లీటర్ టర్బోఛార్జ్డ్ ఇంజిన్ అమర్చారు. డీజిల్ వేరియంట్ కూడా లీటర్ డీజిల్కు 27.4 కిలోమీటర్ల మైలేజిని ఇస్తుందని హోండా చెబుతోంది.