Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: గోద్రేజ్ ఆగ్రోవెట్ సంస్థ దక్షిణాదిలోని అయిదు రాష్ట్రాల్లోని పాడిపరిశ్రమల రంగంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆ సంస్థ తమ అనుబంధ సంస్థ క్రీమ్లైన్ డెయిరీతో కలిసి బుధవారం 'జెర్సీ థిక్షేక్స్'ను మార్కెట్లోకి విడుదల చేసింది. విలువ ఆధారిత ఉత్పత్తులతో మార్కెట్లో విస్తరించాలన్న ప్రణాళికలో భాగంగా ఈ కొత్త ఉత్పత్తులను తాము మార్కెట్లోకి తెచ్చామని.. రానున్న రోజుల్లో బట్టర్ మిల్క్, లస్సీలను కూడా టెట్రా ప్యాక్లలో అందుబాటులోకి తేనున్నట్టుగా గోద్రేజ్ ఆగ్రోవెట్ సంస్థ ఎండీ బల్రామ్ సింగ్ యాదవ్ తెలిపారు. థిక్షేక్స్ను మూడు ఫ్లేవర్లలో అందుబాటులో ఉంచనున్నట్టుగా వివరించారు. పిల్లలకు, మహిళలకు, టీనేజర్లకు ఆరోగ్య పానియాలుగా వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. 100% పాలతో పాటు ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్-ఎ వంటి అత్యవసర పోషకాలను జొప్పించి వీటిని తయారు చేస్తున్నట్టుగా క్రీమ్లైన్ డెయిరీ సీఈవో రాజ్కన్వార్ తెలిపారు. రూ.6000 కోట్ల విలువైన పాడిపరిశ్రమ రంగంలో తమ స్థానాన్ని సమీకృత పాల ఉత్పత్తుల సంస్థగా సుస్థిరం చేసుకోవాలని తాము భావిస్తున్నట్గుఆ రాజ్కన్వార్ వివరించారు. పాల ఉత్పత్తులకు డిమాండ్ ప్రతియేటా 20 శాతం మేర పెరగుతూ వస్తోందని అన్నారు. 180 మి.లీ. జెర్సీ థిక్షేక్ పానియం ధరను కంపెనీ రూ.25లుగా నిర్ణయించింది.