Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: డాలరుతో రూపాయి మారకపు విలువ అంతకంతకు పడిపోతున్న భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రంగంలోకి దిగింది. రూపాయి 15 నెలల కనిష్టానికి చేరడంతో నష్టనివారణ చర్యలను ప్రారంభించింది. బ్యాంకుల ద్వారా భారీగా డాలర్ల విక్రయం చేపట్టడంతో రూపాయి విలువ బుధవారం మార్కెట్లో కొంత కోలుకుంది. బుధవారం ఉదయం డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.1325 స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ భారీగా డాలర్ల విక్రయానికి దిగడంతో డాలరు విలువ కాస్త దిగివచ్చింది. జాతీయ బ్యాంకులు ప్రధానంగా డాలర్ల విక్రయం చేపట్టిన మూలంగానే రూపాయి విలువ కొంత కోలుకుందని కరెన్సీ డీలర్లు వెల్లడిలంచారు. ఈ నేపథ్యంలోనే డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.67.75 స్థాయికి చేరినట్టుగా వారు వివరించారు. చివరకు మార్కెట్లు ముగిసే సమయానికి రూపాయి రూ.67.81 స్థాయిలో స్థిరపడింది. కరెన్సీ మార్కెట్లో ఒడుదొడుకులను ఆర్బీఐ మంగళవారం పట్టించుకొని నేపథ్యంలో డాలరుతో రూపాయి మారకం విలువ ఒక్కసారిగా తగ్గి 15 నెలల స్థాయికి పడిపోయింది. దీంతో వర్తకుల్లో భయాందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే.. తాజాగా ఆర్బీఐ జోక్యంతో బాండ్స్ ఈల్డ్కూడా స్థిరత్వం నెలకొంది. తక్కువ స్థాయి వద్ద ఎగుమతిదారులు కూడా క్రమంగా డాలర్ల విక్రయానికి దిగడం విశేషం.