Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: స్టెరిలైట్ పవర్ సంస్థకు అత్యధిక సామర్థ్యం కలిగిని కండక్టర్ల (ఏసీసీసీ) సరఫరాకు సంబంధించి జీఎస్ ఎస్ కొరియా నుంచి నుంచి అతిపెద్ద ఆర్డరు లభించింది. ఈ ఆర్డరు విలువ 4.7 కోట్ల డాలర్లని సంస్థకు చెందిన సొల్యూషన్ బిజినెస్ సీఈవో మనీష్ అగర్వాల్ తెలిపారు. ఏసీసీసీల విభాగంలో ఒక సంస్థకు ఇంత భారీ అర్డరు లభించడం ఇదే తొలిసారని మనీష్ వివరించారు. బంగ్లాదేశ్ పవర్గ్రిడ్ ప్రాజెక్ట్నందు ఉపయోగించేందుకు గాను జీఎస్ ఎస్ కొరియా సంస్థ ఈ ఏసీసీసీలను తమ సంస్థ నుంచి కొనుగోలు చేస్తున్నట్టుగా ఆయన వివరించారు. రానున్న ఆరు నెలల వరకు తమ ఆర్డర్ బుక్ ఫుల్గా ఉందని ఆయన తెలిపారు.